ఇవి ఎవరికీ హానీ కలిగించవు

ABN , First Publish Date - 2020-08-06T01:48:30+05:30 IST

పాములు సయ్యాటలాడాయి. దాదాపు 20 నిమిషాలపాటు అవి ఒకదానితో ఒకటి చుట్టుకుని ..

ఇవి ఎవరికీ హానీ కలిగించవు

మంచిర్యాల: పాములు సయ్యాటలాడాయి. దాదాపు 20 నిమిషాలపాటు అవి ఒకదానితో ఒకటి చుట్టుకుని చూపరులను ఆశ్చర్యానికి గురి చేశాయి.` మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక రైతు పెరట్లో రెండు పాములు పెనవేసుకున్న దృశ్యం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ దృశ్యాన్ని చూడటానికి గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. చాలాకాలంగా ఈ పాములు ఈ ప్రదేశంలోనే తిరుగుతున్నాయని, ఇవి ఎవరికీ హాని కలిగించవని గ్రామస్తులు అంటున్నారు. 

Updated Date - 2020-08-06T01:48:30+05:30 IST