దుర్గాఘాట్‌లో పాముకు దహన సంస్కారాలు

ABN , First Publish Date - 2021-12-18T21:33:26+05:30 IST

దుర్గాఘాట్‌లో పాముకు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు దహన సంస్కారాలు చేశారు. ఇంద్రకీలాద్రిపై గత కొన్నేళ్లుగా

దుర్గాఘాట్‌లో పాముకు దహన సంస్కారాలు

విజయవాడ: దుర్గాఘాట్‌లో పాముకు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు దహన సంస్కారాలు చేశారు. ఇంద్రకీలాద్రిపై గత కొన్నేళ్లుగా రెండు పాములు  సంచరిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం ఓం టర్నింగ్ వద్ద ఒక పాము చనిపోయింది. దీంతో మనుషుల మాదిరిగానే వైదిక కమిటీ సభ్యులు పాముకు దహన సంస్కారాలు చేశారు. కొంతకాలంగా భక్తులకు, అర్చకులకు పాము దర్శనమిస్తోంది. ఇటీవల అంతరాలయంలో కనిపించి పాము మాయమైంది. కొండపైన రెండు పాములను అత్యంత పవిత్రంగా అర్చకులు భావిస్తున్నారు. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో సర్పాలు చనిపోతే మనుషుల మాదిరిగానే వాటికి కార్యక్రమాలు చేయాలని దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు చెబుతున్నారు.

Updated Date - 2021-12-18T21:33:26+05:30 IST