రోడ్డు ప్రమాదంలో ‘స్నేక్‌’ భాస్కర్‌నాయుడికి గాయాలు

ABN , First Publish Date - 2021-07-31T07:58:22+05:30 IST

టీటీడీ విశ్రాంత ఉద్యోగి, పాములు పట్టే భాస్కర్‌ నాయుడు శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో ‘స్నేక్‌’ భాస్కర్‌నాయుడికి గాయాలు

తిరుమల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): టీటీడీ విశ్రాంత ఉద్యోగి, పాములు పట్టే భాస్కర్‌ నాయుడు శుక్రవారం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తిరుమలలోని జీఎన్సీ కాటేజీల్లో పాము ఉందనే సమాచారంలో ఉదయం 11 గంటలకు తిరుపతి నుంచి ద్విచక్రవాహనంలో ఆయన బయలుదేరారు. ఘాట్‌రోడ్డులోని నాలుగో కిలోమీటరు వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పడంతో ఆయన రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన  ఆయన్ను ఆస్పత్రికి తరలించి వైద్యం చేశారు. వేగంగా గాలి రావడంతోనే తన బైక్‌ అదుపు తప్పిందని భాస్కర్‌ నాయుడు మీడియాకు తెలిపారు. 

Updated Date - 2021-07-31T07:58:22+05:30 IST