అక్రమంగా బియ్యం రవాణా
ABN , First Publish Date - 2020-09-28T11:39:42+05:30 IST
కొత్తపల్లి నుంచి 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. శనివారం అర్ధరాత్రి పాత
నిఘా వేసి పట్టుకున్న గ్రామస్థులు
కొత్తపల్లి, సెప్టెంబరు 27: కొత్తపల్లి నుంచి 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. శనివారం అర్ధరాత్రి పాత పోలీసుస్టేషన్ మీదుగా ఉప్పాడ వెళ్లే వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో కొందరు గ్రామస్థులు మోటార్సైకిళ్లపై వెంబడించి మినీ వ్యాన్ను అడ్డుకున్నారు. వ్యాన్లో ఉన్న వ్యక్తుల్లో ఇద్దరు మోటార్సైకిల్ తాళాలు లాక్కుని గ్రామస్థులపై దాడి చేయబోయారు. దీంతో మిగిలిన వారు పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వ్యాన్ను స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. నిందితులపై క్రిమినల్ కేసు నమోదుకు చర్యలు చేపట్టామని ఎంఎస్వో ఆనంద్ తెలిపారు.