సింగరేణి ఉద్యోగులకు ‘ఎస్‌ఎంఎస్‌’ సమాచారం

ABN , First Publish Date - 2021-01-14T07:52:45+05:30 IST

సింగరేణిలోని 45 వేల మంది ఉద్యోగులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా త్వరగా సమాచారం అందించాలని ఆ సంస్థ నిర్ణయించింది

సింగరేణి ఉద్యోగులకు ‘ఎస్‌ఎంఎస్‌’  సమాచారం

హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలోని 45 వేల మంది ఉద్యోగులకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా త్వరగా సమాచారం అందించాలని ఆ సంస్థ నిర్ణయించింది. ఇప్పటివరకు వేతనాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపుతున్నారు. ఇకనుంచి కార్మికులకు, సంస్థకు సంబంధించిన సమగ్ర సమాచారం కూడా అందించనున్నారు. ఎస్‌ఎంఎ్‌సలు అందుకోనివారంతా సంబంధిత గని/డిపార్ట్‌మెంట్‌ వద్ద మొబైల్‌ నెంబర్లు అందించాలని సింగరేణి జనరల్‌ మేనేజర్‌(కో-ఆర్డినేషన్‌) కె.రవిశంకర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2021-01-14T07:52:45+05:30 IST