అమ్మాయిలూ దుబాయ్‌ వచ్చేశారు

ABN , First Publish Date - 2020-10-23T09:52:46+05:30 IST

మహిళల టీ20 చాలెంజర్‌ టోర్నీ కోసం భారత క్రికెటర్లు గురువారం యూఏఈ చేరుకొన్నారు. విమానంలో పీపీఈ కిట్లు ధరించి ఉన్న ఓపెనర్‌ స్మృతి మంధాన,

అమ్మాయిలూ దుబాయ్‌ వచ్చేశారు

టీ20 చాలెంజర్‌ కోసం...

దుబాయ్‌: మహిళల టీ20 చాలెంజర్‌ టోర్నీ కోసం భారత క్రికెటర్లు గురువారం యూఏఈ చేరుకొన్నారు. విమానంలో పీపీఈ కిట్లు ధరించి ఉన్న ఓపెనర్‌ స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, మిథాలీ రాజ్‌ ఫొటోలను ఐపీఎల్‌ ట్వీట్‌ చేసింది. మహిళల చాలెంజర్‌ వచ్చే నెల 4 నుంచి 9 వరకు జరగనుంది. నాలుగు మ్యాచ్‌లకూ షార్జానే వేదిక కానుంది. ట్రయల్‌ బ్లేజర్స్‌కు మంధాన, సూపర్‌ నోవా్‌సకు హర్మన్‌, వెలాసిటీకి మిథాలీ రాజ్‌ సారథ్యం వహించనున్నారు. బిగ్‌బాష్‌ లీగ్‌ కారణంగా ఆస్ట్రేలియా క్రీడాకారిణులు ఈ సీజన్‌కు దూరమైనా.. ఇంగ్లండ్‌, శ్రీలంక, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా ప్లేయర్లు లీగ్‌లో పాల్గొంటున్నారు. 

Updated Date - 2020-10-23T09:52:46+05:30 IST