కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... ప్రియాంక గాంధీ వాద్రా కీలక ప్రకటన

ABN , First Publish Date - 2021-10-22T03:32:27+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్స్, స్కూటీలను ఇస్తామని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే... ప్రియాంక గాంధీ వాద్రా కీలక ప్రకటన

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి విద్యార్థినులకు స్మార్ట్‌ఫోన్స్, స్కూటీలను ఇస్తామని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రకటించారు. వచ్చే సంవత్సరంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్లు ఇస్తామని అక్టోబర్ 21, 2021 గురువారం ప్రియాంక గాంధీ వాద్రా హామీ ఇచ్చారు. 12వ తరగతి పాసైన విద్యార్థునులకు స్మార్ట్‌ఫోన్స్ ఇస్తామని, డిగ్రీ విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలను ఇస్తామని ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆమె విద్యార్థినులకు పిలుపునిచ్చారు.

Updated Date - 2021-10-22T03:32:27+05:30 IST