చెత్తకుండీలో ఆడశిశువు మృతదేహం
ABN , First Publish Date - 2020-12-06T05:47:15+05:30 IST
మానవత్వం మంటగలిసింది. ఏం పాపం చేసిందో గానీ పుట్టిన కొన్ని గంటల్లోనే ఓ ఆడశిశువు మృతదేహం మద్దిలపాలెం ఆర్టీసీ డిపో వెనుక ఉన్న చెత్తకుండీలో శనివారం ఉదయం ఏడున్నరకు లభ్యమైంది.
ఎంవీపీ కాలనీ, డిసెంబరు 5: మానవత్వం మంటగలిసింది. ఏం పాపం చేసిందో గానీ పుట్టిన కొన్ని గంటల్లోనే ఓ ఆడశిశువు మృతదేహం మద్దిలపాలెం ఆర్టీసీ డిపో వెనుక ఉన్న చెత్తకుండీలో శనివారం ఉదయం ఏడున్నరకు లభ్యమైంది. ఎంవీపీ జోన్ ఎస్ఐ భాస్కరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చెత్తకుండీలో ఆడశిశువు మృతదేహం ఉందన్న సమాచారం అందిన వెంటనే ఎస్ఐ భాస్కరరావు వెళ్లి పరిశీలించారన్నారు. జన్మించిన కొన్ని గంటల్లోనే ఈ శిశువును చెత్తకుండీలో పడివేసినట్టు తమ విచారణలో తేలిందన్నారు. ఈ పసికందు మృతదేహం స్థానికందా, లేకుంటే ఎక్కడినుంచో తెచ్చి ఇక్కడ పడివేశారా? అనే అంశంపై ఆరా తీస్తున్నామని, స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటీజీని కూడా పరిశీలిస్తున్నామన్నారు. మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ మృతదేహానికి సంబంధించి ఎవరికైనా వివరాలు తెలిస్తే 9440999804 సెల్ నంబర్ను సంప్రతించాలని కోరారు.