మధ్యయుగాన్ని గుర్తుకుతెస్తున్న చిన్న జీయర్‌ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-19T09:35:51+05:30 IST

చిన్న జీయర్‌ స్వామి వ్యాఖ్యలు మధ్యయుగాన్ని గుర్తుకు తెస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు.

మధ్యయుగాన్ని గుర్తుకుతెస్తున్న చిన్న జీయర్‌ వ్యాఖ్యలు

చాడ వెంకటరెడ్డి


హైదరాబాద్‌, జనవరి 18(ఆంధ్రజ్యోతి): చిన్న జీయర్‌ స్వామి వ్యాఖ్యలు మధ్యయుగాన్ని గుర్తుకు తెస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఆయన, ఇటీవల చేసిన  ప్రవచనాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. కులాల నిర్మూలన తగదని, ఏ కులం వారు ఆ కులం పనేచేయాలని, మాంసాహారులు ఏ మాంసం తింటారో ఆ జంతువుల మాదిరిగానే వ్యవహరిస్తారని ఆయన చెబుతున్న మాటలు మధ్యయుగాన్ని గుర్తు తెస్తున్నాయన్నారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విగ్రహానికి సంకుచిత భావాలతో ‘‘సమానత్వ ప్రతిమ’’ పేరు పెట్టడం విడ్డూరం అని చాడ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న జీయర్‌ స్వామి ప్రవచనాలు బహుజనుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని ఇలాంటి వ్యక్తి తలపెట్టిన కార్యక్రమాలకు రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి హాజరు కావడం రాజ్యాంగాన్ని అవమానపరచడమే అవుతుందని చాడ స్పష్టం చేశారు.

Updated Date - 2022-01-19T09:35:51+05:30 IST