TS: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు

ABN , First Publish Date - 2021-10-09T13:24:16+05:30 IST

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌లో..

TS: ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు

29న జరగాల్సిన పరీక్షలు 31కి మార్పు

30న జరగాల్సినవి నవంబరు 1కి 

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో రీషెడ్యూల్‌

ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటన


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను రీషెడ్యూల్‌ చేశారు. 29న జరగాల్సిన పరీక్షను 31వ తేదీకి, 30న జరగాల్సిన పరీక్షను నవంబరు 1వ తేదీకి మార్చారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కారణంగా గతేడాది ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించలేకపోయిన విషయం తెలిసిందే. వారందరినీ సెకండియర్‌కు ప్రమోట్‌ చేశారు. ఈ విద్యార్థులంతా ప్రస్తుతం సెకండియర్‌ పాఠాలను చదువుతున్నారు. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితి అదుపులోకి రావడంతో ఫస్టియర్‌ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 25వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 



Updated Date - 2021-10-09T13:24:16+05:30 IST