పసిడి పతకాన్ని తలగడ పక్కన పెట్టుకుని నిద్రపోయా: నీరజ్ చోప్రా
ABN , First Publish Date - 2021-08-09T01:15:03+05:30 IST
: నీరజ్ చోప్రా.. భారత్కు అథ్లెటిక్స్ విభాగంలో తొలి పసిడి పతకాన్ని అందించిన రియల్ హీరో. ఈ యువఅథ్లెట్ను చూసి యావత్ దేశం మురిసిపోతోంది. కాగా.. పసిడిని ఒడిసి పట్టిన నీరజ్ చోప్రా తాజాగా ఓ జాతీయ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: నీరజ్ చోప్రా.. అథ్లెటిక్స్ విభాగంలో భారత్కు తొలి పసిడి పతకాన్ని అందించిన రియల్ హీరో. ఈ యువఅథ్లెట్ను చూసి ప్రస్తుతం యావత్ దేశం మురిసిపోతోంది. కాగా.. పసిడిని ఒడిసి పట్టిన నీరజ్ చోప్రా తాజాగా ఓ జాతీయ చానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. పతకం గెలిచిన రోజు రాత్రి మెడల్ను తలగడ పక్కన పెట్టుకుని నిద్రపోయానని తెలిపాడు.‘‘మెడల్ గెలుచుకోవడం సంతోషాన్ని ఇచ్చింది. అయితే..అప్పటికే బాగా అలసిపోయి ఉండటంతో మాంచి నిద్రపట్టేసింది.’’ అని కూడా నీరజ్ చెప్పాడు. ఒలింపిక్ ట్రాక్ అండ్ ఫీల్డ్ స్టేడియంలో భారత జాతీయ గీతాలాపన జరగడం అదే తొలిసారి కావడంతో..జాతీయ గీతాన్ని వింటున్న తనకు మాటల్లో వర్ణించలేని అనుభూతి కలిగిందని నీరజ్ పేర్కొన్నారు.