‘రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు’

ABN , First Publish Date - 2020-10-31T09:04:09+05:30 IST

వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు రైతులను తప్పు దోవపట్టిస్తున్నాయని బీజేపీ జిల్లా కోశాధికారి పేడాడ సూరపునాయుడు తెలిపారు.

‘రైతులను తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు’

ఆమదాలవలస రూరల్‌: వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు  రైతులను తప్పు దోవపట్టిస్తున్నాయని బీజేపీ జిల్లా కోశాధికారి పేడాడ సూరపునాయుడు తెలిపారు. శుక్రవారం ఆమదాలవలసలో  విలేకరులతో మాట్లాడుతూ  వ్యవసాయ బిల్లులపై రైతులకు అపోహలు కలిగిస్తున్నారని చెప్పారు. వ్యవసాయమార్కెట్‌ కమిటీలు మూతపడవని, ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందని  తెలిపారు. వ్యవసాయ బిల్లులపై అవగాహన లేని పార్టీలు గందరగోళం సృష్టిస్తున్నాయని చెప్పారు. ఆయనతో పాటు  సమావేశంలో పార్టీ నాయకులు బెండి రవికాంత్‌, సనపల రామారావు, బొడ్డేపల్లి మల్లేశ్వరరావు పాల్గొన్నారు.


 వ్యవసాయ ఉత్పత్తులను రైతులు  నచ్చిన ధరకు అమ్మకాలు చేసుకునేలా వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు రూపకల్పన చేసిందని బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు పాతిన గడ్డెయ్య తెలిపారు.  శుక్రవారం కనుగులవలసలో వ్యవసాయ బిల్లుపై అవగాహన కల్పించేందుకు కరపత్రాల పంపిణీచేశారు.  కార్యక్ర మంలో పార్టీ నాయకులు చింతాడ అప్పారావు, గురుగుబెల్లి వెంకటరావు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-31T09:04:09+05:30 IST