ధైర్యంగా ఉండండి
ABN , First Publish Date - 2020-10-30T11:31:08+05:30 IST
మరికొద్ది రోజులు టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయడు తెలిపారు.
మెళియాపుట్టి, అక్టోబరు 29: మరికొద్ది రోజులు టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయడు తెలిపారు. గురువారం శ్రీకాకుళంలోని ఆయన కార్యాలయంలో టీడీపీ మండల నేతలతో సమావేశమయ్యారు. గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసు లు నమోదు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ తప్పులను ప్రజలకు వివ రించాలన్నారు. ప్రతి టీడీపీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బి.పరమేష్రెడ్డి, భాస్కర్గౌడో, చక్రి, సిలార్, మన్మథరావు, కె.రాజు తదితరులు పాల్గొన్నారు.