పట్టాల పంపిణీ పారదర్శకంగా చేపట్టండి
ABN , First Publish Date - 2020-10-29T08:49:58+05:30 IST
గిరిజనులకు ఇచ్చే పట్టాల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని ఐటీడీఏ పీవో శ్రీధర్ అన్నారు. ఇటీవల చేపట్టిన గిరిజన పట్టాల పంపిణీపై బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఐటీడీఏ పీవో శ్రీధర్
కోదూరు(పాతపట్నం), అక్టోబరు 28: గిరిజనులకు ఇచ్చే పట్టాల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని ఐటీడీఏ పీవో శ్రీధర్ అన్నారు. ఇటీవల చేపట్టిన గిరిజన పట్టాల పంపిణీపై బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోదూ రు గ్రామాన్ని సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. అర్హులందరికీ పట్టాలు అందాయా అని ప్రశ్నించారు. అనంతరం పాతపట్నంలో కంటైన్మెంట్ జోన్ను పరిశీలించారు. వీధి వాసులందరికీ కరోనా పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు. ఆయ నతో పాటు డీటీ బి.నాగభూషణరావు, మండల సర్వేయర్ ఎం.జనార్దనరావు, ఈవో పీఆర్డీ నరసింహప్రసాద్ పండా తదితరులున్నారు.