అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ
ABN , First Publish Date - 2020-10-28T09:05:15+05:30 IST
రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. 30 లక్షల విలువ చేసే 230 కంప్యూటర్ల ర్యామ్లు, ప్రాసెసర్లు చోరీ చేశారు.
30 లక్షల విలువ చేసే 230 కంప్యూటర్ల ర్యామ్లు, ప్రాసెసర్లు చోరీ
రాజంపేట, అక్టోబరు 27 : రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో భారీ చోరీ జరిగింది. 30 లక్షల విలువ చేసే 230 కంప్యూటర్ల ర్యామ్లు, ప్రాసెసర్లు చోరీ చేశారు. సీసీ కెమెరాల్లో సైతం రికార్డు కాకుండా వాటి కనెక్షన్లను దుండగులు కత్తిరించి వేశారు. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ దృష్ట్యా కళాశాలకు సెలవులు కావడంతో పకడ్బందీ వ్యూహంతో దుండగులు కళాశాలలో ప్రవేశించి సుమారు 230 కంప్యూటర్ల ర్యామ్లు, ప్రాసెసర్లు దొంగిలించారు. మంగళవారం కళాశాల వైస్ చైర్మన్ చొప్పా యల్లారెడ్డి చోరీ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేయించారు. ఈ సందర్భంగా నారాయణస్వామిరెడ్డి మాట్లాడుతూ చోరీపై పూర్తి స్థాయి విచారణ చేయించి దుండగులను పట్టుకుని తీరుతామని తెలిపారు.