మంత్రిని కలిసిన కార్పొరేషన్ల చైర్మన్లు

ABN , First Publish Date - 2020-10-27T09:45:31+05:30 IST

మంత్రిని కలిసిన కార్పొరేషన్ల చైర్మన్లు

మంత్రిని కలిసిన కార్పొరేషన్ల చైర్మన్లు

పలాస: వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ పంగ పంగ కృష్ణవేణి, శ్రీశయన కార్పొరేషన్‌ చైర్మన్‌ చీపురు రాణి మంత్రి సీదిరి అప్పలరాజును సోమ వారం  కలుసుకున్నారు. పొందర, కురాకుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా రాజాపు హైమావతిని నియమించడంతో ఆ సంఘ నాయకులు మంత్రి సీదిరి అప్పలరాజుకు అభినందించారు.


కార్యక్రమంలో కార్పొరేషన్‌ డైరక్టర్‌ పొం దర దేవి, పొందర సంతోషి, సాంబమూర్తి, మునిసిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ నాగరాణి పాత్రో, దుర్గాప్రసాద్‌ పాత్రో పాల్గొన్నారు. అలాగే అగ్ని కుల క్షత్రి య కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా నియమితులైన జుత్తు నీలకంఠం మంత్రి అప్పలరాజును కలిశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు బొడ్డు ఉమాపతి, కుత్తుమ లోకనాథం, జుత్తు పురుషోత్తం పాల్గొన్నారు.


జీఓను సవరించాలి 

ఉపాధ్యాయుల బదిలీ, రేషనలైజేషన్‌, పదోన్నతులకు సంబంధించిన   జీవో 53, 54 సవరించి న్యాయం చేయాలని యూటీఎఫ్‌ నాయకులు  మంత్రి సీదిరి అప్పలరాజుకు సోమవారం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు బి.ఓంకార్‌, ఎల్‌వి.చలం, బల్ల చిట్టి బాబు, కంచరాన రమేష్‌, ఎం.శ్రీనివాసరావు, కె.జయరామ్‌ పాల్గొన్నారు.

 

టెక్కలిలో కృపారాణిని...

టెక్కలి: కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ కిల్లి కృపారాణిని రాష్ట్ర పోలినాటి వెలమ, శ్రీశయన, పొందర కార్పొరేషన్ల చైర్మన్లు కృష్ణవేణి, రాణీ కృష్ణమూర్తి, హైమవతి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందరంగా వారికి కృపారాణి మిఠాయిలు తినిపించారు. బీసీలకు కార్పొ రేషన్లు ఏర్పాటుచేసి ఆదుకున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ కిల్లి రామ్మోహనరావు, డైరెక్టర్లు సాంబ మూర్తి, బావాజీ నాయుడు, కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-10-27T09:45:31+05:30 IST