షిర్డీ సాయికి అన్నాభిషేకం

ABN , First Publish Date - 2020-10-27T09:47:49+05:30 IST

స్థానిక శివాజీనగర్‌లోని షిర్డీసాయిబాబా సంస్థాన్‌ ట్రస్టులో విజయదశమి, బాబా మహా సమాధి చెందిన దినం పురస్కరించుకొని మందిర చైర్మన్‌, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్‌ ఆధ్వర్యంలో అన్నాభిషేకం, అన్న ప్రసాద వితరణ చేశారు.

షిర్డీ సాయికి అన్నాభిషేకం

శివాజినగర్‌(పలాస), అక్టోబరు 26: స్థానిక శివాజీనగర్‌లోని షిర్డీసాయిబాబా సంస్థాన్‌ ట్రస్టులో విజయదశమి, బాబా మహా సమాధి చెందిన దినం పురస్కరించుకొని మందిర చైర్మన్‌, పీఏసీఎస్‌ మాజీ  అధ్యక్షుడు దువ్వాడ శ్రీధర్‌ ఆధ్వర్యంలో అన్నాభిషేకం, అన్న  ప్రసాద వితరణ  చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షిర్డీలో జరుగుతున్న విధంగానే స్థానిక సంస్థాన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో విజయదశమి, అన్నాభిషేకం, ఏకాహం, అన్నప్రసాద వితరణ నిర్వ హించినట్లు తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు వాయునందనశర్మ, శిష్టు గోపి, ముకుంద, హేమాచలం, బి.వెంకట రమణ, దువ్వాడ అన్నాజీరావు, మల్లా కామేశ్వరరావు, దువ్వాడ లీలారాణి పాల్గొన్నారు.


 స్థానిక రైల్వేస్టేషన్‌ రోడ్డులోని షిర్డీసాయిబాబా ధ్యానమందిరంలో ఆదివారం పంచామృతాభిషేకాలు, అన్నాభిషేకం నిర్వహించారు. కార్య క్రమంలో మందిర ప్రధాన కార్యదర్శి గిన్ని జయశంకర్‌ రెడ్డి, పెంట కృష్ణానందస్వామి, పెంట ప్రసాదరావు తదితరులు  పాల్గొన్నారు.

Updated Date - 2020-10-27T09:47:49+05:30 IST