ఐఎన్‌టీఎస్‌వో ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

ABN , First Publish Date - 2020-10-02T09:02:00+05:30 IST

శ్రీకాకుళం మహాలక్ష్మీనగర్‌ కాలనీలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు ఐఎన్‌టీఎస్‌వో జాతీయ స్థాయి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించారు.

ఐఎన్‌టీఎస్‌వో ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం

గుజరాతీపేట:   శ్రీకాకుళం మహాలక్ష్మీనగర్‌ కాలనీలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు ఐఎన్‌టీఎస్‌వో  జాతీయ స్థాయి పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ ఫలితాల్లో గ్రాండ్‌ ప్రైజ్‌ సాధించిన సనపల రాహుల్‌ (ఏడో తరగతి)కు ల్యాప్‌టాప్‌, ప్రఽథమ బహుమతి సాధించిన బి.రోహిత్‌దత్త(ఎనిమిదో తరగతి), ద్వితీయ బహుమతి సాధించిన వీవీఎస్‌ కౌశిక్‌(5వ తరగతి)లకు  ట్యాబ్‌లను కళాశాల యాజమాన్యం గురువారం బహుకరించింది. అలాగే, 70 మంది విద్యార్థులకు వివిధ బహుమతులు అందజేసింది. మరో 175  మంది విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ను ప్రదానం చేసింది.


కార్యక్రమంలో ఏజీఎం సురేష్‌, రీజనల్‌ ఇన్‌చార్జి ఎస్‌.రామినాయుడు, జోనల్‌ కోఆర్డినేటర్‌ ఎ.బాలరాజు, రాజేష్‌, హెచ్‌ఎం కె.వెంకటేశ్వరరావు, డీన్‌ పి.మోహన్‌బాబు,  అసిస్టెంట్‌ డీన్‌లు పి.కోటేశ్వరరావు, ఎ.హరిప్రసాద్‌, సీ బ్యాచ్‌ ఇన్‌చార్జి ఎస్‌.లక్ష్మీకాంత్‌, ఐకాన్‌ ఇన్‌చార్జి జనార్దనరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఇంద్రమౌళీ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-02T09:02:00+05:30 IST