భోజన పథకం సక్రమంగా నిర్వహించండి
ABN , First Publish Date - 2020-10-01T11:06:37+05:30 IST
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా నిర్వహించాలని ఎంఈవో ఎస్.శివరాంప్రసాద్ కోరారు.
కంచిలి: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా నిర్వహించాలని ఎంఈవో ఎస్.శివరాంప్రసాద్ కోరారు. బుధవారం కంచిలిలో ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ చైర్మన్లు, గ్రామైక ్య సంఘ ఆర్గనైజర్లకు పాఠశాలల్లో భోజన నిర్వహణ, పరిశుభ్రతపై రిసోర్సుపర్సన్లు కె.షణ్ముఖరావు, వై.డిల్లేశ్వరరావు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
పాలకొండ: స్థానిక తమ్మినాయుడు పాఠశాలలో ఎంఈవో ఎంవీ ప్రసాదరావు ఆధ్వర్యంలో బుధవారం జగనన్న గోరుముద్ద మొబైల్ యాప్పై శిక్షణఇచ్చారు. కోర్సు డైరెక్టర్గా హెచ్ఎం జామి రవి వ్యవహరించారు. ఉపాధ్యాయులు కె.శ్రీరామమూర్తి, కేడీకే మోహన్లు ఐఎంఎంఎస్ యాప్ వినియోగంపై వివరించారు.