డిసెంబరు నాటికి అప్రోచ్ రోడ్డు పూర్తి
ABN , First Publish Date - 2020-09-29T11:37:44+05:30 IST
కొమనాపల్లి వద్ద వంశధార నదిపై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్డు పనులు డిసెంబరు నెలాఖరుకు పూర్తి చేయాలని రోడ్లు, భవనాలశాఖ ఎస్ఈ కె. కాంతిమతి ఆదేశించారు.
ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి ఆదేశం
కొమనాపల్లి (జలుమూరు) సెప్టెంబరు 28: కొమనాపల్లి వద్ద వంశధార నదిపై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్డు పనులు డిసెంబరు నెలాఖరుకు పూర్తి చేయాలని రోడ్లు, భవనాలశాఖ ఎస్ఈ కె. కాంతిమతి ఆదేశించారు. సోమవారం అప్రోచ్ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ..వంతెన పనులు పూర్తయినప్పటికీ అప్రోచ్ రోడ్డు పనులు నిలిచిపోవడంతో జలుమూరు, సరుబుజ్జిలి మండలాలకు రాకపోకలకు ఇబ్బంది ఏర్పడిందన్నారు.
పనులు వేగవంతం చేయాలన్నారు. అలాగే దసరా నాటికి తిమడాం అనుబంధ రోడ్డు పనులు పూర్తిచేసి వాహనాలు రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఈఈ సత్యనారాయణ, ఏఈ రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.