రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ABN , First Publish Date - 2020-09-29T11:46:43+05:30 IST
బేసిరామచంద్రపురం జంక్షన్లో సోమవారం ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.బారువ ఎస్ఐ జి.నారాయణస్వామి, స్థానికులు కథనం మేరకు...కంచిలి మండలంలోని జె.శాసనాం గ్రామానికి చెందిన జేజారావు, సరస్వతి కుమారుడు మర్ల కూర్మారావుకు(26) వ్యక్తిగత పనుల కోసం స్నేహితుడు జోగారావుతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు.
సోంపేట రూరల్ : బేసిరామచంద్రపురం జంక్షన్లో సోమవారం ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.బారువ ఎస్ఐ జి.నారాయణస్వామి, స్థానికులు కథనం మేరకు...కంచిలి మండలంలోని జె.శాసనాం గ్రామానికి చెందిన జేజారావు, సరస్వతి కుమారుడు మర్ల కూర్మారావుకు(26) వ్యక్తిగత పనుల కోసం స్నేహితుడు జోగారావుతో కలిసి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. బేసిరామచంద్రపురం జంక్షన్ వద్ద కొర్లాం వైపు వెళ్తుండగా ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళ్తున్న లారీ ఢీకొంది.
యూటర్న్ కావడంతో లారీ ఢీకొన్న సమయంలో ద్విచక్రవాహనం నడుపుతున్న కూర్మారావు కింద చిక్కుకుని మృతిచెందాడు. వెనుక కూర్చున్న జోగారావు గాయాలతో బయటపడ్డాడు. సంఘటనపై బారువ ఎస్ఐ నారాయణస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కూర్మారావుకు మామిడిపల్లి గ్రామానికి చెందిన రోజాతో రెండేళ్లు కిందట వివాహమైంది. వీరికి ఏడాది వయస్సున్న బాబు ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన కూర్మారావు మృతితో తల్లిదండ్రులతోపాటు భార్య రోజారోదిస్తున్నారు. భర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో రోజా విలపిస్తోంది.