ఎస్పీ బాలుకు నివాళి
ABN , First Publish Date - 2020-09-29T11:39:52+05:30 IST
గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పల్లిసారధి భజన మండలి సభ్యులు సోమవారం ఘనంగా నివాలర్పించారు. తొలుత ఆయన చిత్ర పటానికి పూలమాల వేశారు.
వజ్రపుకొత్తూరు: గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి పల్లిసారధి భజన మండలి సభ్యులు సోమవారం ఘనంగా నివాలర్పించారు. తొలుత ఆయన చిత్ర పటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ ప్రతి నిధులు రెయ్యి భీమారావు, పి.కోదండరావు, తామాడ ధనరాజు, పి.ధర్మారావు, యు. ఉదయ కుమార్, అంగ ఆనందరావు, ఎ.శ్యామలరావు, ఎ.ఉదయకుమార్ పాల్గొన్నారు.
పాతపట్నం: గానగంధుర్వుడు ఎస్పీ బాలసుబ్ర హ్మణ్యం మృతి కళారంగానికి తీరని లోటని తంగి అమ్మన్న మెమోరియల్ సేవా సంస్థ అధ్యక్షుడు తంగి రమే ష్ అన్నారు. సోమవారం స్థానిక బస్టాండ్ ప్రాంగ ణంలో ఎస్పీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు ఎం. రామారావు, పి.రవి వర్మ, టి.రామారావు బి.అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
సుద్దముక్కపై బాలు రూపం..
కాశీబుగ్గ: కాశీబుగ్గకు చెందిన సూక్ష్మకళాకారుడు కొత్తపల్లి రమేష్ ఆచారి సోమవారం సుద్ద ముక్కపై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రతిమను గంట వ్యవధిలో తయారు చేసి నివాళులర్పించాడు. ఆ ప్రతిమను చూసిన పలువురు ఆయనను అభినందించారు.