ఒడిశా మద్యం స్వాధీనం
ABN , First Publish Date - 2020-09-27T11:01:02+05:30 IST
టెక్కలి జాతీయ రహదారిపై ఒడిశా నుంచి విశాఖపట్నం కారులో అక్రమంగా తరలిస్తున్న వెళుతున్న రూ.3 లక్షల విలువ గల మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో
టెక్కలి, సెప్టెంబరు 26: టెక్కలి జాతీయ రహదారిపై ఒడిశా నుంచి విశాఖపట్నం కారులో అక్రమంగా తరలిస్తున్న వెళుతున్న రూ.3 లక్షల విలువ గల మద్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు శనివారం పట్టుకున్నారు. 275 ఫుల్ బాటిళ్లు, 48 టిన్ బీర్లుతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు.
విశాఖకు చెందిన ఎన్.రామకృష్ణ, షేక్ ఉమర్ ఆలీలను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ ప్రొహిబిషన్ పోలీసులు తెలిపారు.