కోన కొండల్లో అస్థిపంజరం

ABN , First Publish Date - 2022-08-07T05:22:39+05:30 IST

కోన కొండల్లోని జలపాతం వద్ద ఒక పురుషుడి అస్తిపంజరాన్ని శనివారం కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

కోన కొండల్లో అస్థిపంజరం
అస్థపంజరాన్ని పరిశీలిస్తున్న ఎస్సై క్రాంతికుమార్‌

రాజంపేట వాసిగా గుర్తింపు

రాపూరు, ఆగస్టు 6: కోన కొండల్లోని జలపాతం వద్ద ఒక పురుషుడి అస్తిపంజరాన్ని శనివారం కొందరు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికెళ్లి అస్థిపంజరాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ ద్వారా ఆరా తీయగా అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన  జలకం నర్సింహులుగా (50) గుర్తించారు. వారి  సమాచారంతో కుటుంబసభ్యులు అక్కడకొచ్చి గుర్తించారు. మేలో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-08-07T05:22:39+05:30 IST