Rajasthan: పదహారేళ్ల బాలికపై ఐదుగురి అత్యాచారం

ABN , First Publish Date - 2021-08-31T12:33:45+05:30 IST

పదహారేళ్ల బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో వెలుగుచూసింది....

Rajasthan: పదహారేళ్ల బాలికపై ఐదుగురి అత్యాచారం

జైపూర్ (రాజస్థాన్): పదహారేళ్ల బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో వెలుగుచూసింది. పొరుగింటి యువకుడు పని ఉందని తన కుమార్తెను ఇంటికి పిలిచి అతని నలుగురు స్నేహితులతో కలిసి అత్యాచారం చేశాడని బాధిత బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని నిందితులు హెచ్చరించారు. పొరుగింటికి వెళ్లి వచ్చాక బాలిక ప్రవర్తనలో మార్పులు కనిపించడంతో బాలిక తండ్రి ఆరా తీసి తమకు ఫిర్యాదు చేశారని పోలీసుఅధికారి కుమార్ చెప్పారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని కుమార్ వివరించారు.బాలికను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు.

Updated Date - 2021-08-31T12:33:45+05:30 IST