ఆటోను ఢీకొన్న కారు
ABN , First Publish Date - 2022-07-01T04:37:43+05:30 IST
మండలంలోని జాతీయరహదారిపై కొండూరుసత్రం జ్యోతినగర్ వద్ద గురువారం ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.
ఆరుగురికి గాయాలు
మనుబోలు, జూన్ 30: మండలంలోని జాతీయరహదారిపై కొండూరుసత్రం జ్యోతినగర్ వద్ద గురువారం ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. కర్మక్రియ సందర్భంగా మండలంలోని మడమనూరు గ్రామానికి నెల్లూరు నుంచి భోజనం తీసుకెళ్లిన ఆటో తిరుగు ప్రయాణమైంది. గూడూరు నుంచి నెల్లూరు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది క్యాటరింగ్ సిబ్బందిలో రమేష్, హరి, సుమంత్, పవన్ కల్యాణ్ నాయక్, చంద్ర, పరుశురామ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 ఈఎంటీ జనార్దన్, ఫైలెట్ వినోద్ క్షతగాత్రులకు ప్రథమచికిత్స చేసి నెల్లూరుకు తరలించారు.