ఆటోను ఢీకొన్న కారు

ABN , First Publish Date - 2022-07-01T04:37:43+05:30 IST

మండలంలోని జాతీయరహదారిపై కొండూరుసత్రం జ్యోతినగర్‌ వద్ద గురువారం ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.

ఆటోను ఢీకొన్న కారు
క్షతగాత్రు పవన్‌ కల్యాణ్‌నాయక్‌

ఆరుగురికి గాయాలు

 మనుబోలు, జూన్‌ 30: మండలంలోని జాతీయరహదారిపై కొండూరుసత్రం జ్యోతినగర్‌ వద్ద గురువారం ఆటోను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.  కర్మక్రియ సందర్భంగా మండలంలోని మడమనూరు గ్రామానికి నెల్లూరు నుంచి భోజనం  తీసుకెళ్లిన ఆటో తిరుగు ప్రయాణమైంది. గూడూరు నుంచి నెల్లూరు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మంది క్యాటరింగ్‌ సిబ్బందిలో రమేష్‌, హరి, సుమంత్‌, పవన్‌ కల్యాణ్‌ నాయక్‌, చంద్ర, పరుశురామ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 ఈఎంటీ జనార్దన్‌, ఫైలెట్‌ వినోద్‌ క్షతగాత్రులకు ప్రథమచికిత్స చేసి నెల్లూరుకు తరలించారు. 

Updated Date - 2022-07-01T04:37:43+05:30 IST