Bihar Explosion: బాణసంచా పేలి ఆరుగురు దుర్మరణం

ABN , First Publish Date - 2022-07-24T22:55:57+05:30 IST

బీహార్‌లోని సరన్ జిల్లా ఖొడియాబాగ్ గ్రామంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. షబీర్ హుస్సేన్ అనే బాణసంచా వ్యాపారి ..

Bihar Explosion: బాణసంచా పేలి ఆరుగురు దుర్మరణం

పాట్నా: బీహార్‌లోని సరన్ జిల్లా ఖొడియాబాగ్ గ్రామంలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. షబీర్ హుస్సేన్ అనే  బాణసంచా వ్యాపారి ఇంట్లో భారీ పేలుడు సంభవించి ఆరుగురు అక్కడికక్కడే మరణించాడు. మరో 10 మంది వరకూ శిథిలాల కింద చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు. గంట సేపు వరకూ పేలుళ్ల వినిపిస్తూనే ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మూడంతస్తుల భవంతిలో ఒక పోర్షన్‌లో అక్రమంగా బాణసంచా తయారీ జరుగుతోందన్నారు.


కాగా, భారీ పేలుడు జరగడంతో మంటలు పెద్దఎత్తున చెలరేగి చాలాభాగం కుప్పకూలిందని పోలీసు వర్గాలు తెలిపాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారికి వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేపట్టామని, పేలుడుకు కారణాలు విచారణలో తెలుస్తాయని సరన్ ఎస్‌పీ సంతోష్ కుమార్ తెలిపారు. ఫోరెన్సిక్ టీమ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను రప్పించినట్టు తెలిపారు. జిల్లా ప్రధాన కేంద్రమైన ఛాప్రాకు 30 కిలోమీటర్ల దూరంలో ఖొడియాభాగ్ గ్రామం ఉంది.

Updated Date - 2022-07-24T22:55:57+05:30 IST