సౌదీలో ఆరుగురు భారతీయులు అరెస్ట్.. చేసిన నేరం ఏంటంటే..

ABN , First Publish Date - 2021-07-25T21:46:40+05:30 IST

యజమానిని మోసం చేసిన కేసులో ఆరుగురు భారతీయులు కటకటాలపాలైన ఘటన సౌదీ అరేబియాలో

సౌదీలో ఆరుగురు భారతీయులు అరెస్ట్.. చేసిన నేరం ఏంటంటే..

రియాద్: యజమానిని మోసం చేసిన కేసులో ఆరుగురు భారతీయులు కటకటాలపాలైన ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇండియాకు చెందిన  ఆరుగురు వ్యక్తులు సౌదీ అరేబియాలోని ఓ వ్యాపారి వద్ద గత కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సరుకు దిగుమతికి సంబంధించిన డబ్బును చెల్లిస్తున్నట్టు యజమానిని నమ్మిస్తూ సుమారు రూ. 6.75కోట్లను కాజేశారు. ఉద్యోగుల ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసిన యజమాని పోలీసులను ఆశ్రయించారు. దీంతో వారు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టి ఆరుగురు యువకులు వ్యాపారిని మోసం చేసినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే వారిని అదుపులోకి తీసుకుని, వారు దోచుకున్న ఆరు కోట్ల డబ్బును సీజ్ చేశారు. కాగా.. అరెస్ట్ అయిన వ్యక్తులకు 20-30ఏళ్ల మధ్య వయసు ఉంటుందని సౌదీ స్థానిక మీడియా పేర్కొంది. అయితే అరెస్ట్ అయిన భారతీయుల పేర్లను మాత్రం వెల్లడించలేదు. 


Updated Date - 2021-07-25T21:46:40+05:30 IST