కరోనాతో ఆరుగురు డాక్టర్లు మృతి: ఐఎంఏ

ABN , First Publish Date - 2020-08-13T00:20:06+05:30 IST

కరోనాతో ఆరుగురు డాక్టర్లు మృతి: ఐఎంఏ

కరోనాతో ఆరుగురు డాక్టర్లు మృతి: ఐఎంఏ

చెన్నై: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు మదురైలో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరుగురు వైద్యులు కోవిడ్-19తో మరణించారని ఐఎంఏ పేర్కొంది. మదురై జిల్లాలో కోవిడ్-19 కారణంగా ఆరుగురు వైద్యులు మరణించారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) మదురై శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కారణంగా మరణించిన వైద్యుల సంఖ్యను వివరిస్తూ భారత వైద్య సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది.


Updated Date - 2020-08-13T00:20:06+05:30 IST