ఆరు జిల్లాల్లో నిల్.. Bengaluruలోనే అత్యధికం
ABN , First Publish Date - 2022-03-05T17:13:56+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం మరింత తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 233 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా ఆరు జిల్లాల్లో ఒక కేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 163 మందికి వైరస్ బాధితులు కాగా 23 జి
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ ప్రభావం మరింత తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 233 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా ఆరు జిల్లాల్లో ఒక కేసు కూడా నమోదు కాలేదు. బెంగళూరులో 163 మందికి వైరస్ బాధితులు కాగా 23 జిల్లాల్లో పదిమందిలోపు నమోదయ్యారు. 648 మంది కోలుకోగా ఆరుగురు మృతిచెందారు. బెంగళూరులో ఇద్దరు, నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ఇతర జిల్లాల్లో మృతులు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం 30 జిల్లాల్లో 3,469 మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 2,460 మంది ఉన్నారు.