ఆరు జిల్లాల్లో Covid కేసులు అధికం
ABN , First Publish Date - 2021-10-27T16:36:29+05:30 IST
రాష్ట్రంలో బెంగళూరుతోపాటు మరో ఐదు జిల్లాల్లో రెండంకెలకు పైగా కొవిడ్కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం 290 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 137 మందికి వైరస్
బెంగళూరు(Karnataka): రాష్ట్రంలో బెంగళూరుతోపాటు మరో ఐదు జిల్లాల్లో రెండంకెలకు పైగా కొవిడ్కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం 290 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ కాగా బెంగళూరులో 137 మందికి వైరస్ ప్రబలింది. దక్షిణకన్నడ 30, తుమకూరు 26, హాసన్ 20, మైసూరు 18, ఉత్తరకన్నడలో 15 మందికి వైరస్ సోకింది. పది జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 408 మంది కోలుకోగా 10 మంది మృతి చెందారు. 25 జిల్లాల్లో ఒకరు కూడా మృతి చెందలేదు. 8,583 మంది రాష్ట్రవ్యాప్తంగా చికిత్స పొందుతుండగా బెంగళూరులోనే 6,421 మంది ఉన్నారు.