కార్యాలయంపై దాడి కేసులో ఆరుగురు అరెస్ట్
ABN , First Publish Date - 2021-10-24T22:08:52+05:30 IST
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగరాజు, ఎస్కే బాబు, ఎస్కే సైదా (విజయవాడ), బంక సూర్య
గుంటూరు: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఆరుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోగరాజు, ఎస్కే బాబు, ఎస్కే సైదా (విజయవాడ), బంక సూర్య సురేష్(గుంటూరు), కల్లా మోహన్ కృష్ణారెడ్డి(గుంటూరు), పోలీసుల అదుపులో కాండ్రు కుంట గురవయ్య(గుంటూరు)లను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితుల కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. వీడియో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.