లిఫ్టు ఇస్తామంటూ బాలికపై సామూహిక లైంగిక దాడి

ABN , First Publish Date - 2020-07-29T13:54:23+05:30 IST

తన బాయ్ ఫ్రెండును కలవడానికి వచ్చిన ఓ బాలికకు లిఫ్టు ఇస్తామని చెప్పి, ఆమెను కారులో తీసుకువెళుతూ అందులోనే ఆరుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన....

లిఫ్టు ఇస్తామంటూ బాలికపై సామూహిక లైంగిక దాడి

ఖాసియామంగల్ (త్రిపుర): తన బాయ్ ఫ్రెండును కలవడానికి వచ్చిన ఓ బాలికకు లిఫ్టు ఇస్తామని చెప్పి, ఆమెను కారులో తీసుకువెళుతూ అందులోనే ఆరుగురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన దారుణ ఘటన త్రిపుర రాష్ట్రంలోని ఖాసియామంగల్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఓ మైనర్ బాలిక తన ప్రియుడిని కలిసేందుకు అతని ఇంటికి వచ్చింది. బాలిక బాయ్ ఫ్రెండ్ తో పాటు ఆరుగురు యువకులు ఆమెను ఇంటి వద్ద కారులో దిగబెడతామని చెప్పి ఎక్కించుకున్నారు. యువకులు కారులోనే బాలికపై లైంగిక దాడి జరిపారు.ఈ ఘటనలో బాధిత బాలిక ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి, నిందితులైన ఆరుగురు యువకులను అరెస్టు చేశామని ఎస్పీ కిరణ్ కుమార్ చెప్పారు.

Updated Date - 2020-07-29T13:54:23+05:30 IST