శివాలయాల్లో లక్ష బిల్వార్చన పూజలు

ABN , First Publish Date - 2021-12-02T05:30:00+05:30 IST

పెంటపాడు పార్వతీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా అర్చకుడు సూర్యనారాయణ శర్మ బ్రహ్మత్వంలో గురువారం స్వామికి మహా రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన పూ జలు నిర్వహించారు.

శివాలయాల్లో లక్ష బిల్వార్చన పూజలు
పెంటపాడులో మహిళల కుంకుమ పూజలు

పెంటపాడు, డిసెంబరు 2:పెంటపాడు పార్వతీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో  కార్తీక మాసం సందర్భంగా అర్చకుడు సూర్యనారాయణ శర్మ బ్రహ్మత్వంలో గురువారం స్వామికి మహా రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చన పూ జలు నిర్వహించారు. సాయంత్రం జ్యోతిలింగార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు అన్నసమారాధన లో పాల్గొన్నారు. 

నిడదవోలు సోమేశ్వరస్వామి సన్నిధిలో..

నిడదవోలు, డిసెంబరు 2 : పట్టణంలోని బాలా త్రిపుర సుందరి సహిత సోమేశ్వరస్వామి పంచాయతన క్షేత్రంలో గురువారం కార్తీకమాసం మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకుడు లక్ష్మీనరసింహశాస్ర్తి ఆధ్వర్వంలో స్వా మికి రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, బాలా త్రిపుర సుందరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన స్వామి అమ్మవార్లకు హారతి కార్యక్రమం నిర్వహించారు. అనం తరం అన్నసమారాధన ఏర్పాటు చేశామని ఈవో సోమాల శివ తెలిపారు. 


Updated Date - 2021-12-02T05:30:00+05:30 IST