మూలస్థానేశ్వర ఆలయంలో రేపటి నుంచి శివరాత్రి మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-03-05T08:12:05+05:30 IST

నెల్లూరులోని మూలస్థానేశ్వర స్వామి దేవస్థా నంలో శనివారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతా యని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు.

మూలస్థానేశ్వర ఆలయంలో  రేపటి నుంచి శివరాత్రి మహోత్సవాలు
ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి అనిల్‌

నెల్లూరు(సాంస్కృతికం), మార్చి 4 : నెల్లూరులోని మూలస్థానేశ్వర స్వామి దేవస్థా నంలో శనివారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతా యని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. గురువారం ఆర్డీవో హుస్సేన్‌సాహెబ్‌ ఆధ్వర్యంలో ఆలయంలో అధికారుల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అతిఽథిగా మంత్రి హాజరై ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేయాలని  అధికారులకు సూచించారు. 10వ తేదీన వెండి రావణసేవ, 11వ తేదీన వెండి నందిసేవ, అదేరోజు మహాశివరాత్రి సందర్భంగా అర్ధరాత్రి 12గంటలకు లింగోద్భవాభిషేకం, 12వ తేదీన కల్యాణోత్సవం, 13న రఽథోత్సవం జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర డీఎస్పీ శ్రీనివాసులురెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T08:12:05+05:30 IST