ఎక్కువసేపు కూర్చుంటే అల్జీమర్స్!
ABN , First Publish Date - 2020-02-28T21:37:02+05:30 IST
ఎక్కువసేపు కుర్చీలో కూర్చునే వాళ్లలో జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతుందని అమెరికాలో ఇటీవల చేసిన పరిశోధనలో తేలింది. ఎక్కువ సమయం కూర్చుని ఉండేవాళ్లు మధుమేహం,
ఎక్కువసేపు కుర్చీలో కూర్చునే వాళ్లలో జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతుందని అమెరికాలో ఇటీవల చేసిన పరిశోధనలో తేలింది. ఎక్కువ సమయం కూర్చుని ఉండేవాళ్లు మధుమేహం, గుండెజబ్బుల బారిన పడే అవకాశం, తద్వారా అకాల మరణాలకు గురయ్యేందుకు ఆస్కారం ఎక్కువని కూడా వారు హెచ్చరిస్తున్నారు. గంటల కొద్దీ కూర్చుని ఉండడం వల్ల మెదడులోని జ్ఞాపకశక్తికి సంబంధించిన మీడియల్ టెంపోరల్ లోబ్(ఎం.టి.ఎల్) పొర పలుచబడుతోందని ఈ పరిశోధనలో నిర్ధారణ అయింది. మధ్యవయసు వాళ్లు, వృద్ధుల్లో ఈ పొర దెబ్బతిన్నడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోయి, డిమెన్షియా సమస్యకు దారితీస్తోంది. ఒకసారి పొరదెబ్బ తిన్న తరువాత ఎంత వ్యాయామం చేసినా ఫలితం లేదు. తిరిగి ఎంటిఎల్ పొర బాగుపడదు. కూర్చుని ఉండడాన్ని తగ్గించడమే దీనికి పరిష్కారం అంటున్నారు పరిశోధకులు.