బస్టాండు నిర్మాణం కోసం స్థల పరిశీలన
ABN , First Publish Date - 2022-08-17T05:02:53+05:30 IST
మండల కేంద్రమైన దువ్వూరులో ఆర్టీసీ బస్టాండు నిర్మాణం కోసం మంగళవారం దువ్వూరు తహసీల్దారు రమకుమారి, మైదుకూరు డిపో మేనేజర్ రామకృష్ణ దువ్వూరులోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు.
దువ్వూరు, ఆగస్టు 16: మండల కేంద్రమైన దువ్వూరులో ఆర్టీసీ బస్టాండు నిర్మాణం కోసం మంగళవారం దువ్వూరు తహసీల్దారు రమకుమారి, మైదుకూరు డిపో మేనేజర్ రామకృష్ణ దువ్వూరులోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. దువ్వూరులోని పోలీసు శాఖకు సంబంధించిన స్థలం, జాతీయ రహదారి బైపా్సలోని ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. స్థల వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు ఎస్ఐ కే సీ రాజు, ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ మంజుల, జనరల్ ఏడీ లక్షుమయ్య, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.