క్రీడా మైదానాలకు స్థల పరిశీలన
ABN , First Publish Date - 2022-05-25T05:22:25+05:30 IST
క్రీడా మైదానాలకు స్థల పరిశీలన
ఘట్కేసర్ రూరల్, మే 24 : గ్రామాల్లో క్రీడా మైదానాల కోసం స్థలాల పరిశీలన చేస్తున్నట్లు ఎంపీడీవో అరుణారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కాచవానిసింగారం, మహేశ్వరీనగర్లో మంగళవారం ఆమె క్రీడా మైదానాల కొరకు స్థల సేకరణ చేపట్టారు. కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో, షటిల్ వంటి ఆటల కోసం ప్రతి గ్రామంలో మైదానాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని గ్రామాల్లో స్థలాలను ఎంపిక చేసి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతీ గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి వేణుగోపాల్రెడ్డి, వార్డుసభ్యుడు మట్ట విష్ణుగౌడ్, పంచాయతీ సిబ్బంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.