రైతు వేదిక కోసం స్థల పరిశీలన

ABN , First Publish Date - 2020-06-05T10:35:22+05:30 IST

రైతువేదిక భవనం నిర్మాణానికి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో స్థలాన్ని జిల్లా రైతుసమన్వయ సమితి అధ్య్యక్షుడు ఇస్లావత్‌

రైతు వేదిక కోసం స్థల పరిశీలన

నిడమనూరు: రైతువేదిక భవనం నిర్మాణానికి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో స్థలాన్ని జిల్లా రైతుసమన్వయ సమితి అధ్య్యక్షుడు ఇస్లావత్‌ రామ చంద్రనాయక్‌ గురువారం పరిశీలించారు. అధికారులు స్థలాన్ని కేటాయిస్తే రైతువేదిక నిర్మిస్తామని తెలిపారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్‌ విరిగినేని అంజయ్య, ఆర్‌ఎ్‌సఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటరమణ,మార్కెట్‌ చైర్మన్‌ జానయ్య ఉన్నారు. 


వలస కూలీలను ఆదుకోవాలి

దేవరకొండ టౌన్‌: వలస కూలీలను ఆదుకోవాలని సీఐటీయూ, సీపీఎం ఆధ్వర్యంలో దేవరకొండలో గురువారం ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. నాయకులు వెంకటయ్య, లింగయ్య, నాగరాజు, ఎల్లయ్య, సైదులు, చిన్నవెంకటయ్య, ముత్యాలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T10:35:22+05:30 IST