గర్వపడే విప్లవ చరిత్ర తెలంగాణ సొంతం: ఏచూరి
ABN , First Publish Date - 2020-10-18T10:05:36+05:30 IST
గర్వపడే విప్లవ చరిత్ర తెలంగాణ సొంతమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి అన్నారు.
హైదరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): గర్వపడే విప్లవ చరిత్ర తెలంగాణ సొంతమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి అన్నారు. సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. సీపీఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల ప్రస్థానం(1920-2020)పై ఆన్లైన్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు కుట్ర చేస్తుందన్నారు. విద్య- వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉన్నా ఏకపక్షంగా నూతన విద్యా విధానం, వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చిందని చెప్పారు. ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న టీఆర్ఎ్సను వ్యతిరేకిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీని వ్యతిరేకించే నిర్ణయాలపై టీఆర్ఎ్సను సమర్ధిస్తామని చెప్పారు.