రైతులను ఏడిపించేలా కేసీఆర్ పద్ధతులు: సీతక్క
ABN , First Publish Date - 2022-04-16T21:45:58+05:30 IST
రైతులను ఏడిపించేలా సీఎం కేసీఆర్ విధానాలు ఉన్నాయని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
హైదరాబాద్: రైతులను ఏడిపించేలా సీఎం కేసీఆర్ విధానాలు ఉన్నాయని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శనివారం సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. మిల్లర్ల దోపిడీలో టీఆర్ఎస్ నేతలు కమీషన్లు తీసుకుంటున్నారని మండిపడ్డారు. నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవడం లేదన్నారు. రైతు సంఘర్షణ సభకు రైతులంతా హాజరు కావాలని ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు