నాగాలాండ్ ఎన్‌కౌంటర్: జవాన్లను ప్రశ్నించనున్న సిట్

ABN , First Publish Date - 2021-12-30T00:28:03+05:30 IST

స్థానిక మీడియా కథనం ప్రకారం, నాగాలాండ్‌లోని ఎన్ఎస్‌సీఎన్ (కే)లోని ఓ వర్గం సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో మయన్మార్ సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న..

నాగాలాండ్ ఎన్‌కౌంటర్: జవాన్లను ప్రశ్నించనున్న సిట్

గువహాటి: నాగాలాండ్‌లోని మోన్ జిల్లా ఓటింగ్ అనే గ్రామంలో డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం నాలుగు గంటల సమయంలో కూలీలతో వెళ్తున్న వాహనంపై ఆర్మీ జవాన్లు కాల్పులు జరపడంతో 13 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తోంది. కాగా, గురువారం జవాన్లను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మోన్‌‌లో జరిగిన ఈ ఘటనలో 21వ పారా స్పెషల్ ఫోర్స్‌కి చెందిన 30 జవాన్ల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆర్మీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.


స్థానిక మీడియా కథనం ప్రకారం, నాగాలాండ్‌లోని ఎన్ఎస్‌సీఎన్ (కే)లోని ఓ వర్గం సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో మయన్మార్ సరిహద్దుల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మోన్ జిల్లాలోని ఓటింగ్-టిరు గ్రామాల మధ్యలో ఈ ఆపరేషన్ జరుగుతుండగా, రోజు కూలీలు ప్రయాణిస్తున్న వాహనం కూడా అక్కడికి చేరింది. అయితే అందులో ఉన్న ఉగ్రవాదులే అని అనుమానంతో సైనికులు కాల్పులు జరిపారని మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2021-12-30T00:28:03+05:30 IST