వాట్సాప్ చేయొద్దని మందలించాడని చెల్లి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-10-08T13:06:10+05:30 IST
‘ఫోన్లు ఎక్కువగా వాడొద్దు. వాట్సాప్ చేయొద్దు’ అని మందలించాడు.
హైదరాబాద్/బోయినపల్లి : అన్నయ్య మందలించాడని చెల్లి ఆత్మహత్య చేసుకుంది. బోయినపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ బోయినపల్లిలోని గంగపుత్ర సంఘం బస్తీలో నివాసంఉంటున్న విజయ ప్రైవేట్ ఉద్యోగి. ఈమెకు కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు సమత(19) ఇంటర్ పూర్తిచేసి, ఇంట్లోనే ఉంటోంది.
ఇటీవల సమత తరచూ ఫోన్లు మాట్లాడుతుండడం గమనించిన అన్నయ్య సాయికిరణ్ ‘ఫోన్లు ఎక్కువగా వాడొద్దు. వాట్సాప్ చేయొద్దు’ అని మందలించాడు. మనస్థాపం చెందిన సమత బుధవారం ఉదయం పెంట్హౌ్సలో ఓ గదిలోకి వెళ్లింది. చెల్లి కిందికి రాకపోవడంలో అన్న వెళ్లి పిలిచినా తలుపు తెరవలేదు. తలుపులు బద్దలుకొట్టి చూడగా సీలింగ్ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.