శిక్షణ తరగతులను పరిశీలించిన రాష్ట్ర డిప్యూటీ కమిషనర్‌

ABN , First Publish Date - 2021-10-29T04:58:35+05:30 IST

పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో గత నాలుగు రోజుల నుంచి ఉప సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు జరుగుతున్న శిక్షణ తరగతులను గురువారం పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్‌ శివశంకర్‌ ప్రసాద్‌ పరిశీలించారు.

శిక్షణ తరగతులను పరిశీలించిన  రాష్ట్ర డిప్యూటీ కమిషనర్‌
ఉపసర్పంచ్‌ ఖాదర్‌బాషాను సన్మానిస్తున్న డిప్యూటీ కమిషనర్‌

పొదలకూరు, అక్టోబరు 28 : పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో గత నాలుగు రోజుల నుంచి ఉప సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు జరుగుతున్న శిక్షణ తరగతులను గురువారం పంచాయతీరాజ్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్‌ శివశంకర్‌ ప్రసాద్‌ పరిశీలించారు. శిక్షణ తరగతులను పరిశీలించి, అనంతరం వారితో పలు అంశాల గురించి చర్చించారు. ఈ సందర్భంగా రెండు రోజుల శిక్షణ తరగతుల్లో ఎంత మేరకు నేర్చుకున్నారో అభ్యర్థులను ఆరా తీశారు. అలాగే ఏమి నేర్చుకున్నారో తెలుపవలసిందిగా డిప్యూటీ కమిషనర్‌ కోరగా.. అల్థూర్తి ఉపసర్పంచ్‌  ఖాదర్‌బాషా మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతుల గురించి పూర్తిస్థాయిలో పూసగుచ్చినట్లు వివరించగా, కమిషనర్‌ మెచ్చుకుని అతనిని సన్మానించారు. శిక్షణ పొందిన ఉప సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుజాత, ఈవోపీఆర్డీ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T04:58:35+05:30 IST