AP News: తిరుమలలో హత్యపై సిరిపురపు శ్రీధర్ శర్మ మండిపాటు

ABN , First Publish Date - 2022-07-22T19:19:36+05:30 IST

తిరుమలలో జరిగిన హత్యపై బ్రహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మండిపడ్డారు.

AP News: తిరుమలలో హత్యపై సిరిపురపు శ్రీధర్ శర్మ మండిపాటు

గుంటూరు: తిరుమలలో జరిగిన హత్యపై బ్రహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ(Siripurapu sridhar sharma) మండిపడ్డారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల కొండపై హత్య సిగ్గు మాలిన చర్య అని అన్నారు. టీటీడీ ఈఓ ధర్మారెడ్డి , టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డిలు సిగ్గు తో రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాలక వర్గం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. టీటీడీ చరిత్రలో కొండపై తొలిసారిగా హత్య జరిగిందన్నారు. భక్తుల నుంచి వేల కోట్ల తీసుకోని పాలక వర్గం భక్తలకు సౌకర్యాలు మరిచిందని శ్రీధర్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-22T19:19:36+05:30 IST