Siricilla: మరో గ్రామంలో లాక్డౌన్
ABN , First Publish Date - 2021-12-28T17:36:53+05:30 IST
జిల్లాలోని మరో గ్రామ ప్రజలు తమకు తాముగా లాక్డౌన్ను విధించుకున్నారు.
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని మరో గ్రామ ప్రజలు తమకు తాముగా లాక్డౌన్ను విధించుకున్నారు. ఎల్లారెడ్డి పేట మండలం నారాయణ పూర్ గ్రామంలో రెండు రోజుల పాటు లాక్డౌన్ను విధించారు. ఒమైక్రాన్, కరోనా వైరస్ల దృష్ట్యా రెండు రోజులు లాక్ డౌన్ పాటించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఇప్పటికే గూడెం గ్రామం పది రోజుల పాటు లాక్ డౌన్ విధించుకున్న విషయం తెలిసిందే.