మంత్రి కేటీఆర్ కాళ్లపై పడిన మహిళ
ABN , First Publish Date - 2021-07-27T21:24:52+05:30 IST
సమస్యల పరిష్కారం కోసం ఓ మహిళ మంత్రి కేటీఆర్ కాళ్లపైపడి వేడుకుంది.
సిరిసిల్ల: సమస్యల పరిష్కారం కోసం ఓ మహిళ మంత్రి కేటీఆర్ కాళ్లపైపడి వేడుకుంది. సిరిసిల్ల పర్యటనకు వచ్చిన ఆయన కారు దిగి వెళుతుండగా ఓ మహిళ తన పిల్లలతో సహా మంత్రి కాళ్లపై పడింది. వినతిపత్రం ఇచ్చి కష్టాలను ఏకరువుపెట్టుకుంది. ఆదుకోవాలని వేడుకుంది. వినతి పత్రాన్ని తీసుకున్న కేటీఆర్ డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.