కులాంతర వివాహం చేసుకున్నాడని.. సిరిసిల్లలో దారుణం

ABN , First Publish Date - 2020-10-31T01:21:22+05:30 IST

తెలంగాణలో కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై.. వారి కుటుంబీకులపై

కులాంతర వివాహం చేసుకున్నాడని.. సిరిసిల్లలో దారుణం

సిరిసిల్ల : తెలంగాణలో కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై.. వారి కుటుంబీకులపై దాడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మిర్యాలగూడకు చెందిన ప్రణయ్ ఘటన నుంచి ఇలా దాడులు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. తాజాగా సిరిసిల్లలోని బోయిన్‌పల్లి మండలం స్తంభంపల్లిలో ఇలాంటి దారుణ ఘటనే చోటుచేసుకుంది. మహేష్‌, గౌతమి ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి బయటికెళ్లిపోయి కులాంతర వివాహం చేసుకున్నారు.


అయితే గౌతమి కుటుంబ సభ్యులు, బంధువులు.. మహేష్‌పై కోపంతో అతని తండ్రి లక్ష్మీనారాయణ (అంధుడు)ను కొట్టి చంపారు. విషయం తెలుసుకున్న మృతుడి కుమారుడు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి భార్య డిమాండ్ చేస్తున్నారు. తన కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు.. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని అబ్బాయి తల్లి విజయ చెబుతున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - 2020-10-31T01:21:22+05:30 IST