విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

ABN , First Publish Date - 2021-03-02T06:23:54+05:30 IST

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

 విద్యాధరపురం, మార్చి 1 : సర్‌ సి.వి.రామన్‌ వంటి శాస్త్ర వేత్తల జీవిత చరిత్ర చదివి భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని డీఈవో ఎం.వి.రాజ్యలక్ష్మి విద్యార్థులకు సూచించారు. సోమవారం భవానీపురంలోని రీజనల్‌ సైన్స్‌ సెంటర్‌ నందు జాతీయ సైన్స్‌ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథు లుగా హాజరైన డీఈవో మాట్లాడుతూ విద్యార్థులు చిన్న నాటి నుంచి శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు తెలుసుకుని వారిని స్ఫూర్తిగా తీసుకుని శాస్త్రవేత్తలుగా ఎదగటానికి ప్రయత్నించాలన్నారు. మరొక ముఖ్య అతిథి  డాక్టర్‌ వై.అపర్ణ మాట్లాడుతూ జిల్లాలో అనేక సైన్స్‌ కార్యక్ర మాలు నిర్వహిస్తున్న విద్యాశాఖను అభినందించారు. అనంతరం జిల్లా స్ధాయిలో నిర్వహించిన క్విజ్‌, మోడల్‌ మేకింగ్‌లలో విజేతలకు సర్టిఫికెట్స్‌ మెమెంటోలు అంద జేశారు. జిల్లా సైన్స్‌ అధి కారి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ వాడ డీవైఈవో ఎల్‌.చంద్ర కళ, ఏపీ కాస్ట్‌ ప్రాజెక్ట్‌ అధికారి జే.ధిల్లేశ్వరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-02T06:23:54+05:30 IST