సింగూర్ ప్రాజెక్టు నీరు దిగువకు విడుదల

ABN , First Publish Date - 2021-09-07T00:25:01+05:30 IST

సింగూర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి విడుదల చేసిన నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సూచించారు.

సింగూర్ ప్రాజెక్టు నీరు దిగువకు విడుదల

సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి విడుదల చేసిన నేపథ్యంలో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సూచించారు. ఘనపురం,నిజాంసాగర్ ప్రాజెక్టులకు 8 వేల 500 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేశారు. సింగూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 29.917 టీఎంసిలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 27.09 టీఎంసిలు ఉంది. జల విద్యుత్ కేంద్రంలో 15 మెగావాట్ల  విద్యుత్తు ఉత్పత్తి  ప్రారంభించారు.  


Updated Date - 2021-09-07T00:25:01+05:30 IST